School Grant 2019-20 Phase I
స్కూల్ ‘గ్రాంట్’ నిధులు విడుదల
ఆర్.సి. నం 2191 ,తేదీ 22.06.2019
మొదటి విడతగా రూ 15,56,01,667 విడుదల
సమగ్ర శిక్షా అభియాన్ పథకం ద్వారా 2019-20 సం.కు రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ. 46,68,05,000 లను మంజూరు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈమేరకు విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. 1-15 మంది ఉన్న విద్యార్థులకు 25,000( ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రు.12500),16-100 విద్యార్థులు చదువుకునే పాఠశాలలకు రూ. 25,000, 101-250 మంది విద్యార్థులు ఉండే పాఠశాలలకు రూ. 50,000, 251 -1000 వరకు విద్యార్థులు ఉండే పాఠశాలకు రూ. 75,000, 1000 కంటే ఎక్కువగా విద్యార్థులు ఉండే పాఠశాలలకు రూ.100,000లు కేటాయిస్తూ ప్రభుత్వం నిధులను కూడా మంజూరు చేసింది.
2019-20 సంవత్సరంలో విడుదలైన పాఠశాల గ్రాంట్ (Phase 1) వివరాలు
కేవలం మీ పాఠశాల U -DISE కోడ్ ఎంటర్ చేసి మీ పాఠశాలకు ఎంత గ్రాంట్ వచ్చిందో తెలుసుకోండి.
Type your Comment
comment url